
డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర
నెల్లూరు (టౌన్): ఆదిశంకర గ్రూపు ఆప్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్సిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యాసంస్థల గ్రూపు చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. స్థానిక దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్సిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పడారుపల్లి సుందరయ్యకాలనీ సమీపంలో జాతీయ రహదారిపై గరువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు ఇస్కాన్సిటీకి చెందిన చెంచయ్య చిన్ను(28) అవివాహితుడు. ఆయన వేదాయపాలెంలోని ఓ పొక్లయిన్ కంపెనీలో స్పేర్ పార్ట్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన గురువారం అర్ధరాత్రి బుజబుజనెల్లూరులో స్నేహతుడిని వదిలిపెట్టి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. పడారుపల్లి సుందరయ్యకాలనీ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో రెయిలింగ్ మీద పడ్డారు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచా రం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్ఐ మాల్యాద్రి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని అన్న రవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర