
ఆశపెట్టి మోసం చేశారు
సున్నా వడ్డీకి ఎగనామం
ఈమె పేరు డి.నాగలక్ష్మి. ఊరు వెంకటాచలం మండలం సర్వేపల్లి. చాలా ఏళ్లుగా సర్వేపల్లి పొదుపు సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఎన్నో పర్యాయాలు పొదుపు సంఘం తరఫున బ్యాంకులో రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగారు. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలకు ఠంచనుగా సున్నావడ్డీ సొమ్ము బ్యాంకులో పొదుపు రుణాలకు జమయ్యేది. కూటమి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకం అమలు చేయడం లేదని నాగలక్ష్మి వాపోతున్నారు.
నెల్లూరు (స్టోన్హౌస్పేట): బూటకపు మాటలతో ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీఠమెక్కాక తుంగలో తొక్కారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంత మంది ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.1,500 చొప్పున అందిస్తా. బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానంటూ చంద్రబాబు వేదికలెక్కి ఉపన్యసిస్తూ ఊగిపోయారు. చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది మరోసారి రుజువైంది. గతంలో అధికారంలోకి రాక ముందు ప్రతి పొదుపు మహిళ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అన్నగా నేనే చెల్లిస్తానంటూ సెంటిమెంట్తో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత కర్రుకాల్చి వాత పెట్టారు. ఒక్కొక్క మహిళ అప్పట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు బకాయిలు ఉంటే పూర్తిగా ఎగ్గొట్టి ఎన్నికల ముందు రూ.10 వేలు పసుపు కుంకుమ అంటూ మోసం చేశారు.
ఈ ఏడాదిలో రూ.1,098 కోట్లు
నష్టపోయిన మహిళలు
చంద్రబాబు ఎన్నికల హామీల్లో ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 6.10 లక్షల మంది ఉన్నారు. హామీ అమలు చేయకపోవడంతో మహిళలకు ప్రతి నెలా రూ.91.50 కోట్లు, ఏడాదికి రూ.1098 కోట్లు జిల్లాలోని మహిళలు నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి రుణాలు, సున్నా వడ్డీ, చేదోడు, చేయూత, జగనన్న తోడు, తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.8,143.45 కోట్ల అందజేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
మహిళలకు పెద్దపీట
జిల్లాలో 4.10 లక్షల మంది స్వయం సహాయక గ్రూపు మహిళలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొదుపు మహిళలే కాదు.. ప్రతి మహిళకు పెద్దపీట వేసింది. ప్రతినెలా ఏదోక సంక్షేమ కార్యక్రమంతో మహిళలకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో అమలు చేశారు. ఇంటి పట్టాలు, ఇతర రుణాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి వారి అభివృద్ధికి పెద్దపీట వేసింది. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమల స్థాపనకు భారీ స్థాయిలో ప్రోత్సహించింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
ఐదేళ్లు అందిన సాయం
రూ. 8,143.45 కోట్లు
చంద్రబాబు మోసానికి నెలనెలా
మహిళలు నష్టపోతున్న మొత్తం
– రూ.91.50 కోట్లు
కూటమి పాలన:
బాబూ షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అంటూ అబద్ధపు ప్రచారంతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మహిళలకు తీరని అన్యాయం చేసింది. బాబు బురిడీతో మహిళల భవిష్యత్ ఛిన్నాభిన్నమైంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం అందిస్తానని, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, పొదుపు, సీ్త్ర నిధి రుణాలకు కొర్రీలు పెట్టారు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారు. సకాలంలో పొదుపు చెల్లించిన మహిళలకు సున్నావడ్డీ ఊసే లేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ పీ–4 పథకంలో కొత్త గారడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లు మహిళలకు కొత్త రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నారు.
వైఎస్సార్సీపీ పాలన:
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పటి వరకు పొదుపు మహిళల రుణం మొత్తాన్ని నాలుగేళ్లలో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేశారు. గతంలో టీడీపీ చేసిన మోసానికి డీఫాల్టర్లు అయిన పొదుపు గ్రూపులకు బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలిప్పించి.. ఆ గ్రూపుల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేసేందుకు విస్తృతంగా పొదుపు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు కల్పించి అత్యధిక మంది జీవితాలను మెరుగుపర్చారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడు వంటి పథకాలతో వారి ఆర్థిక స్వాతంత్యానికి దన్నుగా నిలిచారు. అమ్మఒడి వంటి పథకాన్ని కూడా వారి ఖాతాల్లోనే జమ చేశారు. ప్రతి కుటుంబానికి జగనన్న కాలనీల్లో రూ.లక్షల విలువైన ఆస్తిని సొంతం చేశారు.
ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసి నెలకు రూ.1,500 వంతున ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికీ ఇస్తామని నమ్మబలికారు. ఆశ పెట్టి ఇవ్వకుండా చేయడం మోసం చేసినట్టే. ఇకనైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. రూ.వేల కోట్ల అప్పులు తెస్తున్నా.. మహిళలకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత వాగ్దానాలుగా మారిపోతున్నాయి.
– పిడుగు నీలవేణి, సీతారామపురం

ఆశపెట్టి మోసం చేశారు

ఆశపెట్టి మోసం చేశారు