
ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సుకు 11 లక్షల మంది అర్హులు
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీలు గుప్పించారు. జిల్లాలో ఇలాంటి అర్హులు సుమారు 11 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. జిల్లాలో మహిళా ఓటర్ల లెక్క ప్రకారం 10,52,819 మంది ఉన్నారు. ఓటర్లు కానీ లెక్క ప్రకారం సుమారు మరో 50 వేల మంది వరకు ఉండొచ్చు. ఆడబిడ్డ నిధి కింద ఈ ఏడాదిలో జిల్లాలోని అర్హులైన మహిళలు రూ.1,896 కోట్ల నష్టపోయారనే చెప్పాలి. ఇక జిల్లాలో నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళల సగటున లెక్క చూస్తే 3 లక్షల మంది ఉంటున్నారు. ఏడాదిలో సగటున ఒక్కొక్క మహిళకు రూ.2 వేల బస్సు ప్రయాణ ఖర్చు లెక్కపెట్టినా ఈ ఏడాది కాలంగా రూ. 220 కోట్లు నష్టపోయారు.