
తల్లికి వందనం.. పంగనామం
జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 4.10 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఏడాదికి రూ.615 కోట్ల లబ్ధి చేకూరాల్సి ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో ఒక బిడ్డకే పథకం అమలు చేసి 2.27 లక్షల మందికి అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేల వంతున అందజేసింది. తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. మరో రూ.2 వేలు పెరిగి ఉండేది. కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని పంగనామాలు పెట్టారు. ఈ నెలలో స్కూళ్లు ప్రారంభమయ్యాక ఇస్తామని చెబుతున్నా.. ఇంత వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి కనీసం బ్యాంక్ ఖాతా నంబర్లు కూడా సేకరించలేదు. దీన్ని బట్టి ఈ సారికి కూడా.. సారీనే.