
మద్యం అనధికార విక్రయాలపై దాడులు
● పది ఫుల్ బాటిళ్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): విశ్రాంత మిలటరీ ఉద్యోగుల నుంచి మద్యం బాటిళ్లు సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎకై ్సజ్ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు ఆకుతోట సమీపంలోని పార్థసారథి నగర్లో రామ్మోహన్ నివాసం ఉంటున్నారు. అతను విశ్రాంత మిలటరీ ఉద్యోగుల నుంచి మద్యం బాటిళ్లను సేకరించేవాడు. ఒక్కో ఫుల్ బాటిల్పై రూ.500 మార్జిన్ ఉంచుకుని ఇతరులకు విక్రయాలు సాగిస్తున్నాడు. దీనిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ దయాసాగర్కు మంగళవారం సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వై.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్సైలు కాలేషావలి, సీహెచ్ పూర్ణకుమార్లు దాడి చేశారు. రామ్మోహన్ను అదుపులోకి తీసుకుని 10 బాటిళ్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితుడిని నెల్లూరు – 1 ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో హెడ్కానిస్టేబుల్ ఎం.కిరణ్సింగ్, కానిస్టేబుల్స్ ఎన్.మునిరాజ్కుమార్, కె.రమణయ్య పాల్గొన్నారు.