
ఏడాదిగా ఎదురుచూస్తున్నాం
చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తానని మాట ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా.. ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రం నోచుకోలేదు. ప్రతి పండగకు.. ఇదిగో అదిగో.. అంటూ చెబుతూ కాలయాపన చేస్తున్నారు.
– పార్వతి, బాలాజీనగర్
ఆశ పోయింది
ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు అంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. అది నమ్మాం. కొత్తగా ఓట్లు వచ్చిన తాము కూడా ఓట్లేశాం. నేను గూడూరు ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాను. ఉచిత బస్సు పథకం కోసం సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నా. నెల్లూరు నుంచి గూడూరుకు వెళ్లాలంటే రోజుకు రానూ పోనూ రూ.130 చార్జీలవుతున్నాయి. ఉచిత బస్సు ఉంటే ఈ డబ్బులు మిగిలేవి. ఇప్పుడు ఉచిత బస్సు పథకంపై ఆశ పోయింది.
– ఎస్కే రిహానా, నెల్లూరు

ఏడాదిగా ఎదురుచూస్తున్నాం