మైనింగ్‌ అక్రమ కేసుపై సీబీఐతో విచారించండి | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ అక్రమ కేసుపై సీబీఐతో విచారించండి

Jun 1 2025 12:53 AM | Updated on Jun 1 2025 12:53 AM

మైనిం

మైనింగ్‌ అక్రమ కేసుపై సీబీఐతో విచారించండి

నెల్లూరు(అర్బన్‌): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్ట్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేయించాలని కాకాణి పూజిత, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మేరిగ మురళి, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కాకాణి పూజిత మాట్లాడుతూ జిల్లా ప్రజలకు కాకాణిపై ఒక గౌరవం, నమ్మకం ఉందని ఆయనపై పెట్టిన కేసులకు సంబంధించి సీబీఐతో దర్యాప్తు చేయించి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. విచారణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తున్నారని, ప్రజలు ఈ కేసులో నిజం లేదని నమ్ము తున్నారన్నారు. మా వైపు న్యాయం ఉంది. నిజం బయటకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తుపై నమ్మకం లేదని, సీబీఐ విచారణను ధైర్యంగా కోరుతున్నామన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అక్రమాలను తమ నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించడమే నేరమయిందని తెలిపారు. సంవత్సరం క్రితం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని ఎవరో చెప్పారంట. అందుకే అరెస్ట్‌ చేశారనడం తగదన్నారు. ఇలాంటి విష సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు లేదన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ కక్ష పూరితంగా కాకాణిపై కేసు పెట్టారన్నారు. కాకాణి కుటుంబానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలను కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎంతో గౌరవిస్తారన్నారు. తాము ఆయన ఇంటికి వెళ్తే వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తామన్నారు. అలాంటి మంచి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం తగదన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణిపై అక్రమ కేసులో ఏ1 నుంచి ఏ3 వరకు బెయిల్‌ ఇచ్చి ఏ4కి బెయిల్‌ ఇవ్వకుండా చేయడం ఎంతవరకు సబబన్నారు. టీడీపీ నాయకులే ఎవరిని ఎక్కడ అరెస్ట్‌ చేయాలో చెబుతారన్నారు. తప్పు చేయలేదు కాబట్టే తమ నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె ధైర్యంగా సీబీఐ విచారణ కోరిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదు

కాకాణి పూజిత, నాయకుల డిమాండ్‌

ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం

మైనింగ్‌ అక్రమ కేసుపై సీబీఐతో విచారించండి 1
1/1

మైనింగ్‌ అక్రమ కేసుపై సీబీఐతో విచారించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement