హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా

Dec 1 2025 1:10 PM | Updated on Dec 1 2025 1:10 PM

హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా

హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా

హుస్నాబాద్‌: నియోజకవర్గాన్ని, ఆదర్శవంతంగా, మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలిలో విలేకరులతో మాట్లాడారు. 3న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను హుస్నాబాద్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల భవన నిర్మాణం, ఏటీసీ, రాజీవ్‌ రహదారి నుంచి హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రహదారి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోహెడలో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌, హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్టీఏ కార్యాలయ భవనం, ఇందిరా మహిళా శక్తి బజార్‌, ఉమ్మాపూర్‌లో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు, మహిళా సంఘాలకు బస్సులు, హైదరాబాద్‌ నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సును ప్రారంభిస్తారని పొన్నం తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు 70 సైకిళ్లు పంపిణీ చేయనున్నారన్నారు. మొత్తంగా రూ.480.36 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం కలెక్టర్‌ హైమావతితో కలిసి సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ స్థలాన్ని మంత్రి పరిశీలించారు.

ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేద్దాం..

సర్పంచ్‌ ఎన్నికలపై నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్‌ కార్యకర్తలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనను విజయవంతం కోసం జన సమీకరణలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు క్లీన్‌స్విప్‌ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ బలపరుస్తున్న అభ్యర్థి ఒక్కరే ఉండి, వారి గెలుపు కోసం మిగిలిన నేతలంతా ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఉమేష్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్త చైర్మన్‌ కేడం లింగమూర్తి, రాష్ట్ర హౌస్‌ఫేడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, వివిధ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌

3న సీఎం రేవంత్‌ రాక

రూ.480.36 కోట్ల అభివృద్ధి పనులకు

శంకుస్థాపన చేస్తారని వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement