
గురుకుల పాఠశాలలు, కళాశాలలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదువుతున్న పేద పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
– మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
పర్యవేక్షణ లోపించింది..
గురుకులాల ఏర్పాటులో ప్రభుత్వ ఆశయం హర్షించదగినదే అయినప్పటికీ ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి. విద్యాలయాలపై పర్యవేక్షణ లోపించింది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరం.
– కంచర్ల రవి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్
పోరాటాలు చేస్తాం..
గురుకుల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేంత వరకు పోరాటాలు చేస్తాం. పాఠశాలలు, కళాశాలల్లో కనీస సౌకర్యాలు, పౌష్టికాహారం, వసతులను సాధించడమే లక్ష్యంగా భీమ్ ఆర్మీ ముందుకు సాగుతుంది.
– దొబ్బల ప్రవీణ్, భీమ్ ఆర్మీ విద్యార్థి నాయకుడు

