ఒంగోలు సిటీ: ప్రతిపక్షాలు ప్రకటించిన మేనిఫెస్టో అంతా బూటకమని, చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్మితే నట్టేట మునిగినట్లేనని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 10, 11, 12, 18 డివిజన్లలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మన ఒంగోలు–మన వాసన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. అంతకు ముందు ప్రజలు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు సాదరంగా ఆహ్వానం పలికి పూలమాలలతో, శాలువాలతో సన్మానించి, హారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా 11 వ డివిజన్లోని చర్చిలలో బాలినేని శ్రీనివాసరెడ్డికి పాస్టర్లు జాన్ సుబ్బారెడ్డి, జాన్ అగస్టీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 10 వ డివిజన్లో అగ్రహారం, కొప్పోలులో బాలినేని రోడ్షో నిర్వహించారు. 18 వ డివిజన్లో వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెంలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఈ ఐదేళ్లలో సీఎం జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పాలనలో ప్రతి ఇంట్లో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు కేవలం మాటల గారడీతో బురిడీ కొట్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా మళ్లీ సీఎం గా జగన్మోహన్రెడ్డి అవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, లిడ్క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్కుమార్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కోఆప్షన్ మెంబరు శ్యాంసాగర్, వైఎస్సార్సీపీ నాయకులు పట్రా ఐజాక్, కృపాకిరీటి, సంజయ్, రంజిత్, కాళె శివాజీ, ప్రకాష్ రాయల్, మాన్ సింగ్, ఆల్ఫ్రెడ్, క్రాంతి, శ్రావణ్, శేఖర్, కళ్యాణ్, వెంకటేశ్వర్లు, ప్రభు, దిలీప్, విజయ్, చింతగుంట్ల సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. 12 వ డివిజన్కు సంబంధించి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు మహ్మద్ నజీర్, కోఆప్షన్ మెంబర్స్ మహ్మద్ సర్తాజ్, మహ్మద్ షౌకత్, వైఎస్సార్సీపీ నాయకులు కఠారి లక్ష్మణ్, ఎస్కే.నజీర్, అరిగ మల్లి, మహ్మద్ వాజీద్, మోటే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 10 వ డివిజన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు కొప్పొలు సీతారామయ్య, షేక్ మస్తానయ్య, జమ్ము రత్తయ్య యాదవ్, కమ్మ సురేష్, ఎస్కే.శ్రీనుబాషా, ఆవలమంద వెంకటరావు, అంబటి అర్జున్, గద్దల రాజేంద్ర, కాటూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 18 వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మాజీ సర్పంచ్ అడపాల రాము, ఆర్టీఏ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 10, 11, 12, 18 డివిజన్లలో బాలినేని ఎన్నికల ప్రచారం అడుగడుగునా పూలతో, హారతులతో బాలినేనికి ఘనస్వాగతం