No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, May 9 2024 8:00 AM

-

గిద్దలూరు రూరల్‌: జగనన్న పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని త్రిపురాపురం, నరవ, ఎన్‌.బయనపల్లె, కొమ్మునూరు గ్రామ పంచాయతీల్లోని బ్రాహ్మణపల్లె, నల్లగట్ల గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వం అండగా ఉందన్నారు. గడప గడపకు ప్రభుత్వ పథకాలను చేరవేసిన ఏకై క ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ మాత్రమేనన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను గురించి ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ సేవలన్నీ గ్రామాల్లో ఇంటి ముంగిటకే వచ్చి చేరాయన్నారు. చంద్రబాబు మోసపు హామీలను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దన్నారు. జగనన్న చెప్పింది తప్పక చేస్తాడన్నారు. మోసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పేదల పక్షంగా నిలబడి పరిపాలన కొనసాగిస్తున ఏకై క నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. అందరం కలిసి కట్టుగా జగనన్నకు అండగా నిలబడాల్సిన సమం ఇదే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, నరర సర్పంచ్‌ బండి శ్రీనివాసులు, తంబళ్లపల్లె సర్పంచ్‌ రామాంనేయులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఓబులరావుయాదవ్‌, నాగేశ్వరరావు, వెంకటస్వామి, చేరెడ్డి రంగస్వామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement