
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అ ప్పుల బాధతో గొర్రెల కాప రి ఆత్మహత్య చేసుకున్న ఘ టన రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకా రం.. రాగట్లపల్లికి చెందిన నె త్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇ ల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చే యడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ము ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మల్లయ్య (ఫైల్)