
ముగ్గురూ ముగ్గురే..!
డీసీసీబీలో సూపర్వైజర్గా పనిచేస్తూ..
నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్ తెర్లాంలోని డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్(సూపర్వైజర్)గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్గా తెలంగాణ సర్కిల్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దినేష్ కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివాడు. తండ్రి అల్లు లక్ష్మణరావు వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నారు. తల్లి అల్లు గౌరి నందిగాం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) సభ్యురాలు. పెద్ద కుమారుడు సుధీర్కుమార్ వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్నాడు.
– అల్లు దినేష్, నందిగాం, తెర్లాం మండలం
● కష్టపడి చదివి..ఎస్బీఐలో కొలువులు
● ఆనందం వ్యక్తంచేస్తున్న
కుటుంబసభ్యులు, గ్రామస్తులు
తెర్లాం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కష్టపడి చదివారు. ఆ ముగ్గురూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో కొలు వులు సాధించారు. ఒకే గ్రామానికి చెందిన ము గ్గురికి ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ఒక్కసారే రావడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్, గంటసాధిక్, కొల్లి ప్రకాష్లు బుధవారం వెలు వడిన ఎస్బీఐ పరీక్షా ఫలితాల్లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
రైతు బిడ్డ ప్రకాష్..
నందిగాం గ్రామానికి చెందిన కొ ల్లి ప్రకాష్ తె లంగాణ సర్కిల్లో ఎస్బీ ఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రకాష్ తండ్రి సింహాచలం రైతు. తల్లి లక్ష్మణమ్మ గృహిణి. ప్రకాష్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు.
–కొల్లి ప్రకాష్, నందిగాం,
తెర్లాం మండలం
మొదటి ప్రయత్నంలోనే ఎస్బీఐలో
ఉద్యోగం..
నందిగాం గ్రామానికి చెందిన గంట సాంబశివ, పార్వతమ్మల కుమారుడు సాధిక్..మొదటి ప్రయత్నంలోనే మహారాష్ట్ర సర్కిల్లో ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాధిక్ బీకామ్ చదివాడు. తండ్రి సాంబశివ గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి పార్వతమ్మ నందిగాం జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు.
–గంట సాధిక్, నందిగాం, తెర్లాం మండలం

ముగ్గురూ ముగ్గురే..!

ముగ్గురూ ముగ్గురే..!