
నేడు జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని పలు ప్రాంతా ల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగనుందని ఆ శాఖ ఎగ్యిక్యూటివ్ ఇంజనీర్ ఫణికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్కో 133/ 33కేవీ సబ్స్టేషన్లో మెయింటనెన్స్ వర్క్స నిర్వహించనున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలంతా విద్యుత్ అవసరంతో ఉన్న పనులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
అయోధ్యలో
పాలకొండ చిన్నారులు
● రామాలయంలో నృత్య ప్రదర్శనతో అలరింపు
పాలకొండ రూరల్: అయోధ్యలోని రామమందిరంలో పాలకొండ పట్టణానికి చెందిన చిన్నారులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో అలరించారు. పాలకొండలో గల భారతీయ నృత్య శిక్షణ సంస్థ నిర్వాహకులు నివేదిత, శ్రీకాంత్ల పర్యవేక్షణలో 20 మంది చిన్నారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రామమందిరంలో గురువారం జరిగిన గోవిందనామ స్థూప శంకుస్థాప న కార్యక్రమంలో భాగంగా పాలకొండ చిన్నారులు పలుప్రదర్శనలు నిర్వహించారు. రెండురోజుల్లో పవిత్ర శైవక్షేత్రం కాశీలో ఈ చిన్నారులు సంప్రదాయ భరత నాట్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు నృత్య శిక్షణ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
● ఐటీడీఏ పీఓ శ్రీవాత్సవ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, వసతిగృహ సంక్షేమ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాలను శుభ్రపరచడం, తరగతి గదుల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు చేపట్టడం, అన్ని ఐటీ పరికరాలు సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం, నీటి ట్యాంకులను శుభ్రపరచడం వంటి పనులకు సంబంధించి పాఠశాల సంసిద్ధతపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల అధిపతులందరూ విద్యార్థుల ఆరోగ్య కార్డులను నిర్వహించాలని, అనారోగ్యంతో ఉన్న బోర్డింగ్ విద్యార్థులను వారు పూర్తిగా కోలుకునే వరకు లేదా చికిత్స పూర్తిచేసే వరకు ఇంటికి పంపకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు డీఎంహెచ్ఓ సమన్వయంతో విద్యార్థులకు సికిల్సెల్, అనీమియా పరీక్షలు నిర్వహించాల ని చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, ఉప విద్యాశాఖాధికారి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ప్రోగ్రాం అధికారి డా.జగన్మోహన్రావు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, వసతి సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.