నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Jun 6 2025 1:19 AM | Updated on Jun 6 2025 1:19 AM

నాలుగ

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కొత్తవలస: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలె న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ సింహాచలం మాట్లాడుతూ కొత్తవలస మండలంలోని వీరభద్ర పురం, దాసరివానిపాలెం గ్రామాల నుంచి ఆటోలో పీడీఎప్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల పరిధిలో మాటువేసినట్లు చెప్పారు. దాసరివాని పాలెం గ్రామానికి చెందిన సత్యవరపు వెంకటబంగార్రాజు ఆటోలో 4వందల కేజీల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు పట్టుబడిన బియ్యాన్ని సీఎస్‌డీటీ రామకృష్ణకు అప్పగించినట్లు వివరించారు.

ముగ్గురి అరెస్ట్‌

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా అక్రమ తయారీ, రవాణాను నిరోధించే కార్యక్రమంలో భాగంగా గురువారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కురుపాం ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద విలేకరులతో సీఐ మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో స్టేట్‌టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి దాడులు నిర్వహించగా 60 లీటర్ల సారాతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు చెప్పారు. అంతేకాకుండా గ్రామ పరిసరాల్లో పులియబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. అలాగే సారా తయారీ సామగ్రిని అమ్మిన ఓ మహళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పై ముగ్గురినీ రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. గ్రామాల్లో సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ ఎస్సై జె.రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

పార్వతీపురం రూరల్‌: జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన దినేష్‌ (26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్‌ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి ద్విచక్ర వాహనంపై పార్వతీపురం వైపు వెళ్లాడు. చింతలబెలగాం–గిజబ గ్రామాల మధ్య రహదారి పక్కన ఓ తోట సమీపంలో మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. దినేష్‌ మెడ, కాలిపై గాయాలు ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతుడు జలవనరుల శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతునికి భార్యతో పాటు మూడేళ్ల వయసుగల పాప ఉంది. దినేష్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో దినేష్‌ బంధువులు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత1
1/4

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత2
2/4

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత3
3/4

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత4
4/4

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement