పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ప్రమాదం

Jun 6 2025 1:17 AM | Updated on Jun 6 2025 1:19 AM

రామభద్రపురం: మరో మూడురోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఓ యువకుడు అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండల పరిధిలోని రొంపల్లివలస వద్ద ద్విచచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. దత్తిరాజేరు మండల పోలీస్‌స్టేషన్‌ బూర్జవలస గ్రామానికి చెందిన కస్తూ రి సాయి (21) పనినిమిత్తం రామభద్రపురం మండలంలోని ఆరికతోట గ్రామానికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి బూర్జవలసలోని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ప్రభాకర్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన కుమారుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు ప్రభాకర్‌, లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లి వేడుకకు వచ్చి పరలోకానికి..

జి.సిగడాం: సేహితుడి సోదరి వివాహ వేడుకకు వచ్చిన ఓ యువకుడు బావిలో దిగి ఈతరాక మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన జి.సిగడాం మండలం పెంట గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల కేంద్రానికి చెందిన దుగ్గాన అజిత్‌కుమార్‌(19) విజయవాడ కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఇటీవలే ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి సెలవులకు సాలూరు వచ్చాడు. తన స్నేహితుడు తామాడ మహేష్‌ సోదరి పెళ్లి వేడుక కోసం స్నేహితులు తామాడ మహేష్‌, చిట్టివలస కుమార్‌, రాజుతో ఈ నెల 4న సంతకవిటి మండలం మామిడిపల్లి వచ్చారు. సాయంత్రం పూట అందరూ బయటకు వచ్చి జి.సిగడాం మండలం పెంట గ్రామంలో నేల బావి వద్దకు వెళ్లారు. ముందుగా అజిత్‌కుమార్‌ బావిలో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు బావిలో దిగి రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని బయటకు తీసేసరికే అజిత్‌కుమార్‌ మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లి సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.మధుసూదనరావు గురువారం తెలిపారు. వీఆర్‌ఓ భూపతి నర్సింగరావు, వీఆర్‌ఏ బాలకృష్ణ సమక్షంలో శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

బైక్‌ను లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి

పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ప్రమాదం1
1/1

పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement