
మొక్కలతో వాతావరణంలో సమతుల్యం
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200
విజయనగరం లీగల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టిక్తో ముప్పు అనే నినాదంతో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 70 మైక్రాన్ల కన్నా ఎక్కువ పరిమాణంతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు వాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అందువల్ల ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్గ్లాసులు, స్టీల్ బాటిల్స్, కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు జడ్జి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జడ్జి ఎన్.పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, మొబైల్ కోర్టు జడ్జి బుజ్జి, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.రవిబాబు, నాయమూర్తులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని కలిసికట్టుగా నిర్మూలిద్దాం
విజయనగరం: ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. మానవుల జీవన సరళిలో పర్యావరణానికి హాని చేసే వాటిని నిర్మూలించాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యం లో జరిగిన వర్క్షాప్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు నగరంలోని అంబేడ్కర్ కూడలి నుంచి జిల్లా పరిషత్ వరకు ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం అనే నినాదం తో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని, వచ్చే ఏడాది ఈ తేదీ నాటికి జిల్లా పర్యావరణంలో స్పష్టమైన మార్పు కనపడాలని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా భావించి పర్యావరణానికి ప్రాణం పోయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని, దుకాణాలపై దాడులు చేసి ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూస్తున్నామన్నారు. నగరంలో 15 వేల వరకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.
జిల్లా అటవీ అధికారి కొండలరావు మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, దీని పరిణామాలు భవిష్యత్తు వారికీ నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఒక్కరోజే 4 లక్షల మొక్కల్ని జిల్లాలో నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తమ కంపెనీలైన ఎంఎస్ఎం ఫార్మా, శారద మెటల్, అంజన ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీల ప్రతినిధులకు కలెక్టర్ అంబేడ్కర్ ప్రశంసాపూర్వకంగా మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట రమణ, ప్రొఫెసర్ రామకృష్ణ, పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం
నెల్లిమర్ల రూరల్: వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ ఏడాది జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ నగరవనంలో 4లక్షల మొక్కలు నాటే కార్యాక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటే జిల్లాలో పచ్చదనం నిండుతుందన్నారు. పర్యావరణానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని, పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కొండలరావు, ఇన్చార్జ్ ఆర్డీఓ సవరమ్మ, డీఎంహెచ్ఓ జీవనరాణి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత

మొక్కలతో వాతావరణంలో సమతుల్యం