ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

Jul 2 2025 5:41 AM | Updated on Jul 2 2025 5:41 AM

ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

అద్దంకి రూరల్‌: కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని బాపట్ల జిల్లా వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తా మని హమీ ఇచ్చి రూ.13 వేలే తల్లుల ఖాతాల్లో వేయటం విడ్డూరంగా ఉందన్నారు. కొంత మంది తల్లులకు అర్హత ఉన్నా పథకం వర్తించకపో వటంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇంటి వద్దకు వచ్చే రేషన్‌ను తొలగించి దివ్యాంగులకు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement