
పింఛన్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి
ఆరో వార్డు బాబాపేటకు చెందిన మండ్ల మరియమ్మకు పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్బీ కుమారులు 35 ఏళ్ల ఇస్మాయిల్, 32 ఏళ్ల సుభానీ మరుగుజ్జులు. వారికి ప్రస్తుతం రూ.6వేల పింఛన్ అందుతుంది. తమకు రూ.10వేల పింఛన్ ఇవ్వాలని కోరేందుకు అర్జీలతో వచ్చారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కిందకు దిగి వారి వద్దకు వచ్చి అర్జీలను పరిశీలించి వెంటనే మెడికల్ బోర్డుకు సిఫార్సుచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మధులత, డీఎంహెచ్ఓ డాక్టర్ రవిలను ఆదేశించారు.
–కలెక్టర్ను కలిసిన దివ్వాంగురాలు, మరుగుజ్జులు