
50 వంట గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
రాయగడ: సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఎన్ఫొర్స్మెంట్ విభాగం గురువారం పలు హోటళ్లలో ఆకస్మిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో 50 వంట గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నియమాలను ఉల్లంఘించి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న 14 హోటళ్లలో దాడులను నిర్వహించి సిలిండర్లను సీజ్ చేశారు. జేకేపూర్, రాయగడలోని హోటళ్లలో విస్తృతంగా నిర్వహించిన ఈ దాడుల్లో ఏసీఎస్వో సుధాంశు భొయ్, పౌరసరఫరాల శాఖ రాయగడ సమితి ఇన్స్పెక్టర్ ప్రభంజన్ మహాంతి, మున్సిపాలిటీ సిబ్బంది మహేంద్ర రాయ్ పాల్గొన్నారు.

50 వంట గ్యాస్ సిలిండర్లు స్వాధీనం