పిడుగుపాటుకు మూగజీవులు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మూగజీవులు మృతి

Jun 7 2025 12:30 AM | Updated on Jun 7 2025 12:30 AM

పిడుగ

పిడుగుపాటుకు మూగజీవులు మృతి

సారవకోట: రామకృష్ణాపురంలో సాధు అప్పలనాయుడుకు చెందిన ఆవు శుక్రవారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. సుమారు రూ.60 వేలు విలువైన ఆవు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

పిడుగుపాటుకు రెండు మేకలు మృతి

బూర్జ: లచ్చయ్యపేటలో దాసరి తాతారావు, దాసరి నీలం, దాసరి అసిరినాయుడులకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాయి. ఉప్పినివలస గ్రామ పరిసరాలలో మేత మేస్తుండగా శుక్రవారం సాయంత్రం పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్‌ సువ్వారి కరుణ దృష్టికి తీసుకెళ్లారు.

ఇంటిపై పిడుగు

టెక్కలి రూరల్‌: స్థానిక గోపినాథపురం సమీపంలో హనుమంతువీరన్నగారి వీధిలో సత్తారు ధర్మారావు అనే వ్యక్తి ఇంటిపై శుక్రవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనతో గోడలు బీటలు వారి కింద ఉన్న కారుషెడ్‌ మరమ్మతులకు గురైంది. పలు విద్యుత్‌ గృహోపకరణాలు పాడయ్యాయి.

పిడుగుపాటుకు మూగజీవులు మృతి1
1/1

పిడుగుపాటుకు మూగజీవులు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement