
పిడుగుపాటుకు మూగజీవులు మృతి
సారవకోట: రామకృష్ణాపురంలో సాధు అప్పలనాయుడుకు చెందిన ఆవు శుక్రవారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. సుమారు రూ.60 వేలు విలువైన ఆవు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
పిడుగుపాటుకు రెండు మేకలు మృతి
బూర్జ: లచ్చయ్యపేటలో దాసరి తాతారావు, దాసరి నీలం, దాసరి అసిరినాయుడులకు చెందిన మేకలు పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాయి. ఉప్పినివలస గ్రామ పరిసరాలలో మేత మేస్తుండగా శుక్రవారం సాయంత్రం పిడుగు పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సువ్వారి కరుణ దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటిపై పిడుగు
టెక్కలి రూరల్: స్థానిక గోపినాథపురం సమీపంలో హనుమంతువీరన్నగారి వీధిలో సత్తారు ధర్మారావు అనే వ్యక్తి ఇంటిపై శుక్రవారం సాయంత్రం పిడుగుపడింది. ఈ ఘటనతో గోడలు బీటలు వారి కింద ఉన్న కారుషెడ్ మరమ్మతులకు గురైంది. పలు విద్యుత్ గృహోపకరణాలు పాడయ్యాయి.

పిడుగుపాటుకు మూగజీవులు మృతి