
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లాల హాకీ జట్టు క్రీడాకారులను గురువారం ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. మొత్తం 55 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని ఎంపిక చేశామన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్ పురుషుల అంతర్ జిల్లాల హాకీ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఈరవత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఈరవత్రి రాజశేఖర్ ఇద్దరు క్రీడాకారులకు స్పోర్ట్స్ షూ అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి పింజ సురేందర్, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, నాగేశ్, సభ్యులు అర్గుల్ సురేశ్, రాంప్రసాద్, సడక్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
అటెండరే వైద్యుడు!
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతతో అటెండర్లే వైద్యం చేస్తున్నారు. కాలి గాయంతో గురువారం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి కి అటెండర్ డ్రెస్సింగ్ చేసి బ్యాండేజీ వేశారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాలి. ఇక్కడ మాత్రం ఒక వైద్యు రాలు, మరొక ఆయుష్ వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఆయుష్ వైద్యుడు ఓపీ చూస్తుండటంతో అటెండర్ డ్రెస్సింగ్ చేశారు. ఈ ఆస్పత్రి వైద్య విధాన పరిషత్లోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. నిత్యం 200లకు పైగా ఓపీ ఉంటోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యుల కొరత తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో తరగతులు బోధించేందుకు మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేకాధికారిణి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, జంతు, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాల్లో బోధించేందుకు ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీతోపాటు పీజీ చేసి ఉండాలని, శుక్రవారం సాయంత్రం వరకు దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలని తెలిపారు.
మోపాల్ కేజీబీవీలో..
నిజామాబాద్రూరల్: మోపాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ తెలుగు, ఆంగ్లం, గణితం, వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మహిళా అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి రజనీ ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు ఆకాశవాణిలో
‘రైతు సంఘాల’పై చర్చ
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతు ఉత్పత్తి సంఘాల నిర్మాణం, వాటి బలోపేతంపై శుక్రవారం ఆకాశవాణిలో చర్చ జరుగుతుందని జేఎంకేపీఎం చైర్మన్ తిరుపతి రెడ్డి తెలిపారు. ‘పంట పొలా లు’ కార్యక్రమంలో సాయంత్రం 7:15 నుంచి 7:45 గంటల వరకు చర్చ ఉంటుందని, రేడి యోతోపాటు ‘న్యూస్ ఆన్ ఎయిర్’ మొబైల్ యాప్లో కూడా వినొచ్చని పేర్కొన్నారు. ఎఫ్ పీవోల నిర్మాణం, బోలోపేతంపై రైతులు ఈ చర్చను విని అవగాహన పొందాలని కోరారు.

ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక