
తల్లి తిట్టిందని కూతురి ఆత్మహత్య
పిట్లం(జుక్కల్): తల్లి తిట్టిందని కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో బు ధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుడగజంగం కాలనీకి చెందిన సంకు వరలక్ష్మి(14)ను బుధవారం సాయంత్రం ఇంటి తాళపు చెవిని పోగొట్టిందని తల్లి సంకు కవిత తిట్టింది. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి దులానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో మహిళ..
వర్ని: వర్ని పోలీస్స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మక్కవ్వ (45) అనారోగ్య కారణాలతో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మక్కవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాధ భరించలేక గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కొడుకు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు ఒకరు..
సిరికొండ: మండలంలోని మెట్టుమర్రి తండా అట వీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రమణయ్య కొన్నేళ్లుగా తండా లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో తండావాసులే రేకుల షెడ్డు వేసి ఇచ్చారు. మద్యానికి బానిసైన రమణయ్య అటవీ ప్రాంతంలో మృతి చెందాడని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
యువతి అదృశ్యం
రెంజల్(బోధన్): ఎడపల్లి మండలంలోని అంబం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారం రోజుల కిందట రెంజల్లోని తాతయ్య ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపారు. కుటుంబీకులు, బంధువుల ఇళ్లల్లో గాలించినా కనిపించకపోవడంతో తాత రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.