రాజకీయ కక్ష సాధించటానికే కేసీఆర్‌కు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్ష సాధించటానికే కేసీఆర్‌కు నోటీసులు

Jun 4 2025 12:43 AM | Updated on Jun 4 2025 12:43 AM

రాజకీయ కక్ష సాధించటానికే కేసీఆర్‌కు నోటీసులు

రాజకీయ కక్ష సాధించటానికే కేసీఆర్‌కు నోటీసులు

నిజామాబాద్‌ రూరల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని జెడ్పీ మాజీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌ సర్కార్‌ ఇలాంటి నోటీసులతో కుట్ర పన్నుతోందని ఓ ప్రకటనలో ఆయన ఆరోపించారు. ఎలాంటి కుట్రలనైనా తిప్పికొట్టే నైపుణ్యం బీఆర్‌ఎస్‌కు ఉందని, రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికై నా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌పై తీగ మొక్కల తొలగింపు

సుభాష్‌నగర్‌: ‘ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్‌’ పేరుతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే స్పందించారు. నగరంలోని వినాయక్‌నగర్‌లోగల 100 ఫీట్ల రోడ్డుకు ఆను కుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ స్తంభంపైకి ఎగబాకిన తీగ జాతి మొక్కలను మంగళవారం తొలగించారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను శుభ్రం చేశారు. కాగా విద్యుత్‌ ప్రమాదంపై ప్రచురితమైన కథనం ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పిచ్చిమొక్కలను తొలగించినందుకు ‘సాక్షి’కి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు.

‘పది’ సప్లిమెంటరీ

పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో మంగళవారం పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 179 మంది విద్యార్థులకుగాను 130 మంది విద్యార్థులు హాజరయ్యారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సిరికొండ: న్యావనంది, కొండాపూర్‌, జగదాంబ తండాలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. న్యావనందిలో యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ముత్తెన్న, నరేందర్‌, జనార్దన్‌, కొండాపూర్‌లో ఆకుల జగన్‌, శ్రీధర్‌, బుచ్చన్న, కిషోర్‌గౌడ్‌, గౌస్‌, చంద్రాగౌడ్‌, ఫారూఖ్‌, జగదాంబ తండాలో రవినాయక్‌, ప్రవీణ్‌, బలరాం, కిషన్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్పల్లి: దుబ్బాకలో మంగళవారం 21 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్‌ నాయకులు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, నాయకులు ప్రతాప్‌ గౌడ్‌, సంతోష్‌ రెడ్డి, సాయి, దశరథ్‌, ప్రేమ్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం

సిరికొండ: జగదాంబ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం ప్రారంభించారు. భూమి పూజ చేసి ముగ్గు పోశారు. యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రవినాయక్‌, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌, భూపతి, బలరాం, గోపాల్‌, గంగాధర్‌, లాల్‌సింగ్‌, గణేష్‌, రాయలు పాల్గొన్నారు.

జక్రాన్‌పల్లిలో..

జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్‌ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రారంభించారు. నాయకులు కాట్‌పల్లి నర్సారెడ్డి, సొప్పరి వినోద్‌, వసంత్‌రావు, నట్ట తిరుపతి, జీపీ కార్యదర్శి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

డిచ్‌పల్లి: కమలాపూర్‌లో ఇళ్లు లేని 37 మంది పేదలకు మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.

డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ న్యాస రాజేశ్వర్‌, పంచాయతీ కార్యదర్శి సుమతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్‌, ఆశారెడ్డి, గోపాల్‌, రాజేందర్‌, పోచన్న, సాయిబాబా, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement