
ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..
అనారోగ్యంతో ఒకరు..
నీట మునిగి మరొకరు..
తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతె సామెల్ దంపతులకు ఇద్దరు కుమారులు. మతిస్థిమి తం సరిగ్గాలేని పెద్ద కుమారుడు సాయిబాబు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కొడుకు నవీన్ బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అతడైనా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే.. సోమవారం నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోయాడు. ఇలా ఇద్దరు కుమరులు కళ్లముందే మరణించడంతో సామెల్ దంపతులకు తీరని గర్భశోకం మిగిలింది.
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: సరదాగా క్రికెట్ ఆడిన యువకులు.. ఈత కొట్టేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లి నీట మునిగి మృతిచెందా రు. ఈ ఘటన మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలపిన వివరాలి లా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 11 మంది యువకులు సోమవారం సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు. అనంతరం స్నానం చేసేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో దిగారు. వీరిలో ఎల్లారెడ్డికి చెందిన మధుకర్గౌడ్(17), సోమార్పేట్కు చెందిన హర్షవర్ధన్(17), తిమ్మారెడ్డికి చెందిన నవీన్(23) గల్లంతయ్యారు.
మృతుల బంధువులు గాలించేందుకు ప్రయత్నించి నా అప్పటికే చీకటి పడడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో వలలతో గాలించారు. మొదట మధుకర్గౌడ్ మృతదేహం లభ్యమయ్యింది. మధ్యాహ్న సమయంలో నవీన్, హర్షవర్ధన్ల మృతదేహాలు లభించాయి. చెట్టంత కొడుకులు కళ్లముందు విగత జీవులుగా కనిపించడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదన లు స్థానికులను కంటతడి పెట్టించాయి.
గాలింపు చర్యలను పట్టించుకోని అధికారులు
నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకు లు గల్లంతైనా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వలల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
ఒక్కగానొక్క కుమారుడు..
సోమార్పేట గ్రామానికి గూల రాజలింగం దంపతులకు హర్షవర్ధన్ (17) ఒక్కడే కొడుకు. ఇంటర్ చదువుతూ గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. సోమవారం సరదాగా ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కిషన్గౌడ్ పెద్ద కొడుకు మధుకర్గౌడ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. తోటి వారితో ఆటపాటలతో సరదాగా ఉండేవాడు. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన మధుకర్.. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.
నిజాంసాగర్ బ్యాక్వాటర్లో
మునిగి ముగ్గురి మృత్యువాత
మూడు కుటుంబాల్లో తీరని విషాదం

ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..

ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..