
500 మందికిపైగా నోటీసులు
సుభాష్నగర్: కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి 500 మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు మంగళవారం తరలివచ్చారు. ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో కార్యాలయ సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఇంతమంది రావడానికి గల కారణాలను ఆరా తీయగా.., నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిసి ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) కొత్త యాప్ను నూతనంగా ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పంచాయతీ కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్ (ఆన్లైన్ అటెండెన్స్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ తరహా అటెండెన్స్ను నిరసిస్తూ పంచాయతీ కార్యదర్శులు గత నెల 24 నుంచి డీఎస్ఆర్ను చేపట్టడంలేదు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు మే 31న పంచాయతీ కార్యదర్శులందరికీ డీపీవో శ్రీనివాస్రావు మెమోలు (నోటీసులు) జారీచేశారు. డీఎస్ఆర్ను ఎందుకు చేపట్టడం లేదో వివరణ ఇవ్వాలని ఆ మెమో సారాంశం. అందులోభాగంగా పంచాయతీ కార్యదర్శులందరూ ఒకేసారి డీపీవో కార్యాలయానికి తరలివచ్చారు. డీపీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి వివరణలు స్వీకరించారు.
‘వివరణ’ ఇచ్చేందుకు డీపీవో
కార్యాలయానికి తరలి వచ్చిన
పంచాయతీ కార్యదర్శులు