National Space Day: 2035 నాటికి భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో చీఫ్ | Own Space Station ISRPO Chief Reveals India | Sakshi
Sakshi News home page

National Space Day: 2035 నాటికి భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో చీఫ్

Aug 23 2025 12:22 PM | Updated on Aug 23 2025 12:22 PM

Own Space Station ISRPO Chief Reveals India

న్యూఢిల్లీ: భారతదేశం అంతరిక్ష రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నదని,  2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్  ఏర్పాటవుతుందని ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ పేర్కొన్నారు. నేడు(ఆగస్ట్‌ 23)  జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా  ఉంటుందని నారాయణన్‌ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ, దార్శనికతల ఆధారంగా చంద్రయాన్-4 మిషన్ మనకు సాకారమయ్యింది. వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం  ఏర్పాటు కానుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్ కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement