సామ్రాజ్య భారతి1891/1947
ఘట్టాలు
మణిపూర్ తిరుగుబాటు
19వ శతాబ్దం చివరిలో బర్మా థాయ్లాండ్ను ఆక్రమించిన తరుణాన్ని అవకాశంగా తీసుకొని మణిపూర్ బర్మా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లింది. బర్మా మణిపూర్పై దండెత్తింది. దీనితో పక్కనున్న బెంగాల్ను పరిపాలిస్తున్న బ్రిటిష్వారు బర్మాను నిరోధించడానికి 1891లో మణిపూర్ను బర్మానుండి చేజిక్కించుకుని తమ సామ్రాజ్యంలో కలుపుకొన్నారు. ఆనాటి ఘటనల ఫొటోతో వచ్చిన ఒక పుస్తకం ముఖచిత్రం ఇది.
చట్టాలు
ఈజ్మెంట్స్ యాక్ట్, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్, మెయిల్ షిప్స్ యాక్ట్, కాయినేజ్ యాక్ట్
జననాలు
బి.ఆర్. అంబేడ్కర్ : న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజ్యాంగశిల్పి (మధ్యప్రదేశ్); బీర్బల్ సాహ్నీ : పురావృక్ష శాస్త్రవేత్త (బెహ్రా, పశ్చిమ పంజాబ్); సంపూర్ణానంద్ : ఉపాధ్యాయులు, రాజకీయనేత (ఉత్తరప్రదేశ్); చంపకరామన్ పిళ్లై: విప్లవకారుడు, రాజకీయ కార్యకర్త (కేరళ); వైకుంఠభాయ్ మెహ్తా : వ్యవసాయ, బ్యాంకింగ్, గృహ రంగాల సహకార ఉద్యమ నాయకుడు (గుజరాత్); జ్ఞానాంజన్ నియోగి : సంఘ సంస్కర్త, స్వా.స.యో. (బిహార్).
,