భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు
 - Sakshi

దేవరకొండ : రిజర్వాయర్ల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ఆదేశించారు. మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్‌లోని శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి, నక్కలగండి రిజర్వాయర్ల పరిధిలో భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల పరిఽధిలో భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వేగవంతం చేయాలని ఆయన ఆయా శాఖల అధికారులకు సూచించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ గోపిరాం, ఇరిగేషన్‌ శాఖ ఈఈలు, డీఈఈలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములపై అదనపు కలెక్టర్‌ సమీక్ష

మిర్యాలగూడ : పోడు భూముల కేటాయింపులపై అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ, అటవీ, భూసర్వే విభాగాల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఏఓ రాధా, డివిజనల్‌ సర్వేయర్‌ బాలాజీ, ఆయా మండలాల తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top