
బస్టాండ్ ఉన్నా.. కుర్చీలు నిల్
వాజేడు మండల పరిధిలోని జగన్నాధపురం జంక్షన్ ఉంది. ములుగు జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి వెళ్లే ప్రయాణికులకు ఇది అనుసంధాన ప్రాంతం. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా జగన్నాధపురం జంక్షన్ వద్ద బస్ షెల్టర్ను నిర్మించినా ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, బేంచీలు లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు బస్ షెల్టర్లో కుర్చీలు, బేంచీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.