అల్లు అరవింద్‌ తల్లి మృతి.. వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Expresses Condolences On Demise Of Allu Aravind Mother Kanakaratnamma | Sakshi
Sakshi News home page

అల్లు అరవింద్‌ తల్లి మృతి.. వైఎస్‌ జగన్‌ సంతాపం

Aug 30 2025 1:08 PM | Updated on Aug 30 2025 3:39 PM

YS Jagan Expresses Condolences On Demise Of Allu Aravind Mother Kanakaratnamma

దివంగ‌త నటుడు అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగ‌త సీనియర్ న‌టులు అల్లు రామ‌లింగ‌య్య  స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్  త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ గారు మృతి చెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

​కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న  బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. 

అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement