
‘తాగునీటి సమస్య రానివ్వం’
మెదక్జోన్: మెదక్ మున్సిపాలిటీకి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపు పగిలిపోవటంతో ఇతర నీటి వనరులను ఉపయోగించి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని అదనపు కలెక్టర్ నగేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణానికి ర్యాలమడుగు శివారు నుంచి తాగునీరు నీరు సరఫరా అవుతుందని, అది పగిలిపోవటంతో మరమ్మతులు జరుగుతున్నా యని తెలిపారు. కాగా ప్రజలకు నీటి ఎద్దడి రానివ్వకుండా పట్టణంలోని పంపు సెట్లను ఉపయోగిస్తూ పట్టణ ప్రజలకు నీరుి సరఫరా చేస్తున్నామని చెప్పారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు.
బస్సుల కోసం ఆందోళన
నర్సాపూర్ రూరల్: రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నత్నయ్యపల్లి, కాగజ్ మద్దూర్, కొండాపూర్ గ్రామస్తులు శుక్రవారం నర్సాపూర్–హైదరాబాద్ 765డీ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. గతంలో గంటకు ఒక బస్సు నడిపేవారని, ప్రస్తుతం ఒక బస్సు కూడా నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నట్లు వాపోయారు. అనంతరం డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నగేశ్, రాజు మద్దతు తెలిపారు.
సైబర్ నేరాలపై
అవగాహన అవసరం
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్
పెద్దశంకరంపేట(మెదక్): ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, సిబ్బందితో కలిసి సైబర్నేరాల పోస్టర్ను ఆవిష్కరించారు. పోలీస్స్టేషన్కు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు భరోసా కల్పించాలని, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, అల్లాదుర్గం ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
49 మంది గిరిజన
విద్యార్థుల ఎంపిక
మెదక్ కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అవకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల్లాలో 3, 5, 8వ తరగతుల్లో చేరేందుకు మొత్తం 78 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా 49 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు.

‘తాగునీటి సమస్య రానివ్వం’