ప్రజా సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

May 9 2025 1:30 AM | Updated on May 9 2025 1:30 AM

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

నెన్నెల: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామాలకు తరలిరండి’ అనే కార్యక్రమాన్ని నెన్నెల, నందులపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు, రైతులు, కార్మికులపై పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపర్చారు. విద్యార్థులంతా ప్రజల జీవన స్థితిగతులను అధ్యాయనం చేయాలన్నారు. గ్రామాల్లో పేదలకు పక్కా ఇళ్లు, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు దుర్గం బ్రహ్మానందం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌, ఎం.గణేశ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మి, ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి రత్నం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement