గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

May 6 2025 12:06 AM | Updated on May 6 2025 12:06 AM

గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉట్నూర్‌రూరల్‌: గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అందించిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో మనోహర్‌, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్‌వో సందీప్‌, డీపీవో ప్రవీన్‌ , జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు.

● ఉట్నూర్‌ మండలం కమాయిపేట గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని భీంరావు అర్జీ అందించాడు.

● బోథ్‌ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన రాజేశ్వరి తనకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా మంజూరు కల్పించాలని విన్నవించింది.

● కుమురం భీం జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్‌కు చెందిన ఆత్రం లత తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది.

● 9 నెలలు గడిచినా వేతనాలు చెల్లించని సొల్యూషన్‌ విద్యాంజలి సంస్థ జిల్లా కోఆర్డినేటర్లపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అర్జీ అందించారు.

ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement