
కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...!
‘కడుపున పుట్టిన పిల్లలు పట్టెడన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు.. పైగా నా పేరున ఉన్న భూమిని కూడా లాక్కున్నారు’ అంటూ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు సోమవారం గద్వాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ బీఎం సంతోష్కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్కు చెందిన పాపమ్మకు 4 కుమారులు. వృద్ధాప్యంలో అండగా నిలబడాల్సిన వారు ఆమె పేరిట ఉన్న 2.37 ఎకరాల భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేగాకుండా కనీసం రోజు భోజనం కూడా పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. – గద్వాల