
వలసబాటలో మృత్యుఒడికి..
ఆదోని రూరల్: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..బల్లేకల్ గ్రామానికి చెందిన గోవింద్కు ముగ్గురు కుమారులు కాగా, హనుమంతు (20) చివరి వాడు. గోవిందు అనారోగ్యంతో గత కొంతకాలం క్రితం మృతిచెందగా.. ఉపాధి నిమిత్తం హనుమంతు హైదరాబాద్ వెళ్లాడు. నిర్మాణంలో ఉన్న 12 అంతస్థుల భవనంలో శుక్రవారం స్లాబ్ వేస్తుండగా కాలు జారి కింద పడ్డాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే గాయపడిన యువకుడిని సమీపంలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన బల్లేకల్కు తరలిస్తున్నారు.
అన్ని వర్గాల వారికి రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా రైతులకు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు రుణ సదుపాయం కల్పిస్తామని చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా ఆయన బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొదుపు లక్ష్మి గ్రూపులకు కూడా తక్కువ వడ్డీతో రుణాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేడీసీసీబీ 5వ స్థానంలో ఉందని, తమ హయాంలో మొదటి స్థానంలోకి తీసుకరావడానికి కృషి చేస్తామన్నారు. కాగా.. రోడు ప్రమాదంలో మరణించిన తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ విష్ణువర్దన్రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీసీవో ఎన్.రామాంజ నేయులు, డీసీసీబీ సీఈవో రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వలసబాటలో మృత్యుఒడికి..