
ట్రాక్టర్ శుభ్రం చేస్తుండగా..
రుద్రవరం: ఆలమూరు గ్రామంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శేఖర్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు చంద్ర(22) అప్పుడప్పుడు తమ సొంత ట్రాక్టర్తో సేద్యపు పనులకు వెళ్లేవాడు. ఇందులో భాగంగానే శనివారం పొలానికి వెళ్లేందుకు ట్రాక్టర్ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ ముందుకు కదలింది. ఆపేందుకు యత్నించిన చంద్ర ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కింద పడ్డాడు. అతనిపై చక్రాలు వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.