
శ్రీమఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి
మంత్రాలయం రూరల్: శ్రీమఠంలో కొలువైన శ్రీరాఘవేంద్ర స్వామిని శనివారం కర్ణాటక హైకోర్టు జడ్జి అశోక్ ఎస్. కినాగి దర్శించుకున్నారు. ఉదయం మంత్రాలయం చేరుకున్న న్యాయమూర్తికి శ్రీమఠం మహాముఖద్వారం వద్ద మఠం అధికారులు శ్రీమఠం ధార్మిక మేనేజర్ శ్రీపతి ఆచార్ స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను కుటుంబ సమేతంగా అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు కాసేపు ముచ్చటించారు.
వినికిడి లోపం
ప్రాణం తీసింది!
● రైలు పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన గూడ్స్
ఆదోని సెంట్రల్: వినికిడి లోపం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కోసిగి మండల కేంద్రానికి చెందిన జంపాపురం బసన్న (56) ప్రమాదావశాత్తు శనివారం రైలు కింద పడి మృతి చెందాడు. కోసిగి ఎల్సిగేట్ నంబర్.205 అప్లైన్ ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్ రైలు తగిలి తలకు బలమైన రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. వినికిడి సమస్య కారణంగా దూరంగా వస్తున్న గూడ్స్ శబ్దం వినిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
డోన్ టౌన్: ప్రజలు ప్రశాంతంగా జీవించేలా శాంతిభద్రతలను పరిరక్షిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. డోన్ డీఎస్పీ కార్యాలయంపై నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు డీఐజీ కోయ ప్రవీణ్, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రి బీసీ ఆర్ధిక సహకారంతో పోలీసు పెట్రోలింగ్ కోసం రూ.5.5లక్షలతో కొనుగోలు చేసిన డ్రోన్ను వారు ప్రారంభించారు. అనంతరం ఆర్ అండ్బీ నూతన అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రజల జీవనానికి ఆటంకం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. అనంతరం డోన్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు సీఐలు ఇంతియాజ్బాషా, సీఎం రాకేష్, ప్రవీణ్కుమార్, మోహన్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.

శ్రీమఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి