
రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లుపై మంగళవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రిటైర్డ్ ఓఎస్డీ అంజయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మిల్లులో నిల్వ ఉంచిన సుమారు 400 క్వింటాళ్ల అనుమానిత రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు అన్ని అనుమతులున్నాయంటూ మిల్లు యజమాని ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై గోదాంకు తరలించారు. దాడుల్లో డీఎస్వో జితేందర్రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ వసంతకుమార్, అసిస్టెంట్ డీఎం శ్రీననాయక్, డీటీలు ఉమాపతి, విష్ణు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వామి, రాజేందర్రావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.