రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక

Published Mon, Dec 25 2023 1:42 AM

ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు - Sakshi

కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి జీయర్‌ గురుకుల పాఠశాలలో ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లాస్థాయి సబ్‌ జూనియర్స్‌ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి వందమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పలువురు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో జీయర్‌ గురుకులం విద్యార్థులు రోహిత్‌, హరిఓం, దిలీప్‌, జగన్‌, ఖానాపూర్‌ ఆశ్రమ పాఠశాలకు చెందిన నితిన్‌, ఖానాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన సునీల్‌, బాలికల విభాగంలో జీయర్‌ గురుకులంతోపాటు, మామిడిగూడ, చికుగట్‌, మంచిర్యాల ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు లక్ష్మి, రూప, శ్రీజ, జారు, నిహరిక, మీనాక్షి, రుషిత ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయిపోటీల్లో వీరు పాల్గొంటారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జెట్‌) అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, శాంతారాం స్వామిజీ, హెచ్‌ఎం చక్రధర్‌, ఆర్చరీ సంఘం జిల్లా సెక్రటరీ భుక్యా రమేశ్‌, పీడీ రవీందర్‌గౌడ్‌, కోచ్‌లు మారుతి, జగదిరావు తదితరులు పాల్గొన్నారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
1/1

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

Advertisement
 
Advertisement