
మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడతా..
28వ ర్యాంకర్ యజ్ఞేశ్వరి
అమలాపురం టౌన్: ఏపీ ఈ సెట్ ఫలితాల్లో అమలాపురానికి చెందిన పితాని యజ్ఞేశ్వరి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించింది. ఆమె సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంక్ను కై వసం చేసుకుంది. ఆమె అమలాపురం ఆరు నెలలుగా పీఆర్ ప్రాజెక్ట్స్ విభాగంలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈమె తండ్రి వెంకటరమణ వడ్రంగి మేస్త్రిగా పనిచేస్తున్నారు. భవిష్యత్లో మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని ఆమె పేర్కొంది. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో యజ్ఞేశ్వరిని ఈఈ పులి రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు ప్రశంసించారు.