వీళ్లతో మామూలుగా ఉండదు!
తమ వారైతే చాలు..
ఒక పక్క హాస్టళ్లకు ఇన్ఛార్జ్లు ఉండటానికి వీల్లేదని సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టాభిపురం ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో రెగ్యులర్ వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పరివర్తన భవన్ కాలేజీ బాలికల హాస్టల్కు ఇన్ఛార్జ్గా గత సంవత్సరం నుంచి ఓ వార్డెన్ పనిచేస్తుంది. సదరు వార్డెన్ పరివర్తన భవన్లోనే విధులు నిర్వహిస్తూ రెగ్యులర్ హాస్టల్ వార్డెన్గా వెళ్లకుండా అక్కడ ఓ అనధికార మహిళకు హాస్టల్ బాధ్యతలు అప్పగించిన విషయం అందరికి తెలిసినప్పటికీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా జిల్లాలోని పలు హాస్టళ్లలో కొంతమంది తమకు మామూళ్లు అప్పజెప్పే వార్డెన్ల వైపు కన్నెత్తి చూడరని కార్యాలయ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం. జిల్లా సంక్షేమ కార్యాలయంలో ముగ్గురు వార్డెన్లు ఖాళీగా ఉన్నప్పటికీ వారికి ఎటువంటి పోస్టింగులు వేయకుండా అక్కడే ఉంచి.. తమకు మామూళ్లు అప్పగించే వారికి ఇన్ఛార్జ్ వార్డెన్లుగా పోస్టింగ్ కల్పిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నగరంలోని హయ్యర్ హాల్–1 హాస్టల్కు మార్చి నుంచి ఇప్పటి వరకు బిల్స్ ఆగిపోయాయి. ఎటువంటి కారణాలు లేకుండానే బిల్స్ ఆపేశారు. మామూళ్లు ముట్టజేబితే ఆటోమేటిక్గా బిల్ పేమెంట్ అయిపోతాయని కార్యాలయ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం.
కుక్ని ఇవ్వమని అడిగినందుకు సస్పెన్షన్
గుంటూరు నగరం హయ్యర్ హాల్ 1లో వార్డెన్గా జూన్ నెలలో తిరుపతి స్వామి బాధ్యతలు స్వీకరించారు. హాస్టల్లో విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు కుక్ లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ఆయనే తన సొంత డబ్బులతో కుక్ను, కబాటీని పెట్టుకుని విద్యార్థులకు భోజనం పెట్టారు. తనకు కుక్ను కేటాయించాలని నెలవారీ వార్డెన్ల సమావేశంలో అధికారులను అడిగినందుకు ఆయన్ను టార్గెట్గా చేసుకుని పని కట్టుకుని మరి అదే పనిగా హాస్టల్ విజిట్స్ పేరుతో తనిఖీలు చేపట్టి ఆగస్టు 28న సస్పెండ్ చేశారు. తీరా ప్రస్తుతం అదే హాస్టల్కు వేరే వార్డెన్ను ఇన్ఛార్జ్గా వేస్తే అతనికి మాత్రం కుక్, కబాటీ, వాచ్మెన్లను ముగ్గురు కేటాయించారు.
సాంఘిక సంక్షేమ శాఖలో మామూళ్ల పర్వం
● వార్డెన్ల విషయంలో
అధికారుల ద్వంద్వ వైఖరి
● తమకు అనుకూలంగా ఉండే
వారికి అన్నింటా అగ్ర తాంబూలం
● అనుకూలంగా లేని వారికి హాస్టళ్ల
తనిఖీల పేరుతో ఇబ్బందులు
● అవసరమైతే సస్పెండ్ చేయడానికి
వెనుకాడని వైనం
● పట్టించుకోని ఉన్నతాధికారులు
హాస్టళ్ల నిర్వహణ గాలికి...!


