
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది.
– కె.గంగమణి,
విద్యార్థిని
సాగు విధానాలు తెలుస్తున్నాయి
క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది.
– పి.ఝాన్సీ,
విద్యార్థిని
క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు
విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు,
జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్
ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ
రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం.
– ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా

చదువు కంటే చూసి గ్రహించడంలోనే..

చదువు కంటే చూసి గ్రహించడంలోనే..

చదువు కంటే చూసి గ్రహించడంలోనే..