
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢమాసపు తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకాలు