
కూటమి సేవలో పోలీసులు
పలమనేరు : రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని కూటమి నేతల కోసం పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారని మంగళవారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆరోపించారు. సాక్షి టీవీలో అమరావతి అంశంపై డిబేట్లో మాట్లాడిన వారిని కాదని అక్కడున్న జర్నలిస్ట్పై నిందలు మోపి అరెస్ట్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఛానెళ్లు మరీ ఘోరంగా మాట్లాడినా అప్పట్లో ఇలాంటి అక్రమ అరెస్టులు జరిగాయా అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్సిక్స్తో పాటు 147 హామీలను అమలు చేయాల్సిందిపోయి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను ఏ మార్చడం కుదరదన్నారు. జర్నలిస్ట్ కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని సాక్షాత్తు న్యాయస్థానమే తప్పు బట్టిదంటే పోలీసులు ఎంత అత్యుత్సాహంతో రెడ్బుక్ కోసం పాటు పడుతున్నారో సామాన్య ప్రజలకు సైతం బాగా అర్థమవుతోందన్నారు.