బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jun 29 2025 2:34 AM | Updated on Jun 29 2025 2:34 AM

బాపట్

బాపట్ల

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఎత్తిపోతల పథకాలను పట్టించుకోని ప్రభుత్వం

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం

అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి

చీరాల టౌన్‌: అందరికీ అన్నంపెట్టే అన్నదాతల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం తీరుతో సాగునీరు అందుతుందా..లేదా.. అనే భావనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి అన్నారు. పంటల సాగుకు ముఖ్యమైన సాగునీరు అందించడంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. శనివారం చీరాల మండలంలోని తోటవారిపాలెం పంపింగ్‌ స్కీం పథకాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పథకంలో మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవడం, నీరు సరఫరా అయ్యే కాలువ అధ్వానంగా మారి నీటి సరఫరాకు అవాంతరాలు ఉన్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలో వేల ఎకరాలు పంట పొలాలు ఎత్తిపోతల పథకాల ద్వారానే పంటల సాగు చేస్తారని వివరించారు. ఏళ్ల కిందట నిర్మించిన ఈ పథకాల్లో చాలాచోట్ల మోటార్లు పనిచేయకపోవడం, పైపులైన్లు మరమ్మతులకు గురౌతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. అన్నదాతలను నట్టేట ముంచేలా పరిపాలన చేస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల ఎకరాల పొలాలకు ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేయించి పంట కాలువల పూడికతీత, పైపులైన్లు త్వరగా ఏర్పాటు చేసి సాగు నీరుకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జి.వెంకటకరావు, ఆయా గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీరంలో ఆక్రమణలు తేల్చేందుకు జిల్లా కలెక్టర్‌ వేసిన విచారణ కమిటీపై పచ్చ నేతల ప్రభావం ఉందన్న విమర్శలున్నాయి. తీరం కబ్జాదారులు బాపట్ల, చీరాల ప్రాంతాల్లో కీలకమైన పచ్చనేతలు కావడంతో విచారణ సజావుగా జరగకుండా వారు అధికారులను అడ్డుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే తీరంలో ఆక్రమణల వ్యవహారం పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం కనిపించడంలేదు. బాపట్ల మండలం పాండురంగాపురం, చీరాల, వేటపాలెం మండలాల పరిధిలోని ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం వరకూ సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వ, అసైన్డ్‌, అటవీ భూములను పచ్చనేతలు కబ్జా చేసి ఏకంగా కొంత భూమికి పట్టాలు పుట్టించారు. అంతటితో వదలక ఆన్‌లైన్‌ కూడా చేశారు. వాటిని రియల్టర్లు, రిసార్ట్స్‌ యజమానులకు కట్టబెట్టారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు రెవెన్యూ అధికారులు అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిలో వేటపాలెం తహసీల్దార్‌ను కలెక్టర్‌ సరెండర్‌ చేశారు. అక్కడి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు.

ప్రధానంగా వేటపాలెం, చీరాల మండలాల్లో ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరుగుతోంది. మరోవైపు బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీర ప్రాంతంలో చీరాలకు చెందిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కబ్జాచేసి వాటిని గుంటూరుకు చెందిన మరో పచ్చ ప్రజాప్రతినిధికి చెందిన భ్రమర ఇన్‌ఫ్రా కంపెనీకి దారాదత్తం చేసి కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి.

కబ్జా భూముల్లో రియల్‌ వెంచర్లు వేసి భూములను అమ్మకానికి పెట్టగా మరికొంత భూముల్లో ఏకంగా రిసార్ట్‌లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తీరంలో పచ్చనేతల భూ ఆక్రమణలు గుర్తించిన మత్స్యకారులు ఇదేందుర్మార్గమని గొంతెత్తి అరచి రోడ్డెక్కారు. తీరం మాహక్కు అని, ఎవరు వచ్చి కబ్జా చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతటితో వదలక ఆందోళనకు దిగారు.

కలెక్టర్‌ హామీతో వేటకు మత్స్యకారులు

స్పందించిన కలెక్టర్‌ వెంకట మురళి మత్స్యకారులకు నచ్చజెప్పి తీరం భూములను కబ్జా కోరల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముందస్తుగా మత్స్యకారుల వేటకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ కమిటీ నియమించి ఆక్రమణల వ్యవహారం తేలుస్తామని చెప్పారు. దీంతో మత్స్యకారులు తాత్కాలికంగా ఆందోళన విరమించి వేట బాట పట్టారు.

7

న్యూస్‌రీల్‌

కమిటీపై ‘పచ్చ’ ప్రభావం

విచారణ కమిటీపై విమర్శలు

అయితే విచారణ కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పచ్చపార్టీ నేతలు విచారణ కమిటీపై ఒత్తిళ్లు పెంచినట్లు ప్రచారం వుంది. పచ్చనేతలకు భూములు కట్టబెట్టేందుకు కొందరు రెవెన్యూ అధికారులే సహకరించారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూములకు డీకేటీలు ఇచ్చిన విషయంలో బాపట్ల అధికారుల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి. మత్స్యకారులతోపాటు ప్రజాసంఘాలు ఇదే ఆరోపణ చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు విచారణ కమిటీలో ఉండకూడదని మత్స్యకార సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కబ్జాల్లో పచ్చ నేతలే సూత్రదారులు, పాత్రదారులు వందల ఎకరాల అసైన్డ్‌ భూముల ఆక్రమణ కడలి పుత్రుల ఆందోళనతో బయటపడ్డ కబ్జా పర్వం కొందరు స్థానిక రెవెన్యూ అధికారులే కబ్జాకు సహకరించారన్న ఆరోపణలు ప్రభుత్వ భూములకు డీకేటీలు ఇచ్చారని విమర్శలు

తెర వెనుక రెవెన్యూ, సీఆర్‌జెడ్‌ అధికారుల పాత్ర

తీరంలో పచ్చనేతల కబ్జాలకు కొందరు రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్‌, సీఆర్‌జెడ్‌ అధికారుల సహకారముందన్నది మత్స్యకార సంఘాల ఆరోపణ. వాస్తవానికి సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి ఎంత దూరంలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములున్నాయో వారు తేల్చరు. రెవెన్యూ వారు ఆ భూముల వివరాలు బయటకు చెప్పరు. తీరం అలల దాకా పచ్చనేతలు భూములు ఆక్రమించినా సీఆర్‌జెడ్‌ అధికారులు అందిన కాడికి దండుకొని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు సీఆర్‌జెడ్‌ తీరం నుంచి ఎంతదూరం వుందో కూడా ఆ శాఖ అధికారులు ఇప్పటికీ స్పష్టత నివ్వడంలేదు. తీరంలో ఒక్కో దగ్గర ఒక్కోలా నిబంధనలు ఉంటాయని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. బాపట్ల జిల్లాలో తీరం మొత్తాన్ని కబ్జాల మయంగా మార్చడం వెనుక సీఆర్‌జెడ్‌ అధికారుల పాత్ర వుందన్న విమర్శలున్నాయి. మొత్తంగా తీరాన్ని పచ్చనేతలకు అప్పగించి కొందరు రెవెన్యూ అధికారులతోపాటు సీఆర్‌జెడ్‌ అధికారులు కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పచ్చనేతల ప్రభావంతో తీరం ఆక్రమణలపై విచారణ సజావుగా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమే?

బాపట్ల1
1/7

బాపట్ల

బాపట్ల2
2/7

బాపట్ల

బాపట్ల3
3/7

బాపట్ల

బాపట్ల4
4/7

బాపట్ల

బాపట్ల5
5/7

బాపట్ల

బాపట్ల6
6/7

బాపట్ల

బాపట్ల7
7/7

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement