
ప్రభుత్వ విద్య బలోపేతమే ధ్యేయం
తెనాలిటౌన్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ధ్యేయమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు. గురువారం తెనాలి మారీసుపేటలోని ఎన్సీఆర్ హైస్కూల్ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రుచి, శుచితో కూడిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో మొత్తం 674 మంది విద్యార్థులు చదువుతుండగా మొదటి రోజున 274 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల హెచ్ఎం కరిముల్లా మంత్రి మనోహర్కు తెలిపారు. ఎంఈఓలు వి.జయంతిబాబు, మేకల లక్ష్మీనారాయణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్