ఘనంగా గనుల భద్రత వారోత్సవాలు
కడప కోటిరెడ్డిసర్కిల్: మైన్స్ సేఫ్టీ వీక్ అండ్ ప్రొడక్టివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ గనుల భద్రతా వారోత్సవాలు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ రఘుపతి పెద్దిరెడ్డి, కిషోర్కుమార్ డోకుపర్తి, ఎన్ మారుమూత్తు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కృష్ణ అయ్యర్, గ్రూప్ హెచ్ఆర్ హెడ్ రమేష్ వీపీ, హెచ్ఆర్ ఎల్.సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో నిడిజీవి లైవ్ స్టోన్ మైన్స్, ది ఇండియా సిమెంట్ లిమిటెడ్ గనుల భద్రతా విషయంలో మొదటి బహుమతి గెలుచుకుంది.


