రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Jun 12 2025 7:35 AM | Updated on Jun 12 2025 7:37 AM

సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలను నిరసిస్తూ జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలపై ఆమె ఆధ్వర్యంలో మహిళా నేతలంతా స్థానిక పాతబస్టాండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి స్వస్తి చెప్పి, డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలుజేయాలని కోరుతూ డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై ఆరాచకాలు చాలా ఎక్కువగా జరగడం దారుణమన్నారు. హోంమంత్రి మహిళ అంటే ఎంతో సంతోషపడ్డామని, అయితే ఆమె కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శించారు. చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఆత్యాచారాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు, మహిళలు అన్యాయానికి గురవుతున్నా తోటి మహిళగా హోంమంత్రికి పరామర్శించే తీరిక కూడా లేకపోవడం బాధాకరమని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బాలికలు, మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేదని, నేటి కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువై, తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి బాలికలు, మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అరకు, పాడేరు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు సమిడ పూర్ణిమాదేవి, కిల్లో ఉర్వశిరాణి, పాడేరు వైస్‌ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, సీహెచ్‌.మీనా, లకే రామకృష్ణపాత్రుడు, సర్పంచ్‌లు బీమాలమ్మ, వంతాల సీతమ్మ, మాదెల రమణమ్మ, కూడా సుబ్రహ్మణ్యం, లకే రామసత్యవతి, కోడా సుశీల, వరలక్ష్మి, నీలమ్మ పాల్గొన్నారు.

రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం:

అనంతగిరి(డుంబ్రిగుడ): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ధ్వజమెత్తారు. బుధవారం ఆమె ఆధ్వర్యంలో కాశీ పట్నంలో మహి ళలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహా నికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ఱ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడిపిస్తోందని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభు త్వం వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

హోంమంత్రిగా మహిళ ఉన్నా

దారుణంగా అరాచకాలు

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో మరింత అన్యాయం

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు 1
1/2

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు 2
2/2

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement