అభివృద్ధి పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jun 12 2025 3:15 AM | Updated on Jun 12 2025 3:15 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సాక్షి,పాడేరు: జిల్లాలోని పలు ఇంజనీరింగ్‌శాఖల పరిధిలో రూ.728 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభ శిలాఫలకాలను కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ బుధవారం ఆవిష్కరించారు. స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో రూ.600 కోట్ల ఉపాధి హమీ పనులకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రానున్న మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు. కిలో కాఫీ గింజలను రూ.525 ధరతో విక్రయించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ అభిషేక్‌గౌడ,ఎస్‌డీసీ లోకేశ్వరరావు,ఆర్టీసీ చైర్మన్‌ ఎస్‌.దొన్నుదొర, గిరిజన సంక్షేమశాఖ ఈఈ కె.వేణుగోపాల్‌, ఎస్‌ఎంఐ ఈఈ రాజేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement